ఏపీలో సచివాలయాల ఉద్యోగులకు బిగ్ రిలీఫ్! కీలక ప్రకటన!
Thu May 22, 2025 09:29 Politics.202505223541.jpg)
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థను పక్కనబెట్టేసిన కూటమి సర్కార్ ఇప్పుడు సచివాలయాల వ్యవస్ధలోనూ హేతుబద్ధీకరణ పేరుతో కీలక మార్పులు చేస్తోంది. తద్వారా భారీ ఎత్తున సచివాలయ ఉద్యోగుల్ని సైతం పక్కనబెట్టడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. సచివాలయ ఉద్యోగుల తొలగింపుల వ్యవహారంపై జరుగుతున్న చర్చపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయాల్లో అస్తవ్యస్ధ పరిస్దితులు ఉన్నాయని, సచివాలయాల సేవలు లబ్దిదారులకు సక్రమంగా అందడం లేదని ఆరోపిస్తూ ఉద్యోగుల హేతుబద్దీకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ ప్రక్రియ తాజాగా పూర్తయింది కూడా. అయితే ఇందులో గుర్తించిన ఉద్యోగుల్ని తొలగిస్తారన్న ప్రచారం మొదలైంది. దీనిపై మంత్రి స్వామి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఎవరినీ తొలగించబోమని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు దసరా బంపర్ ఆఫర్! మంత్రి కీలక ప్రకటన!
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల హేతుబద్ధీకరణ ప్రక్రియ వల్ల సచివాలయాల సంఖ్య తగ్గదని, పెరిగే అవకాశాలే ఉన్నాయని మంత్రి స్వామి తెలిపారు. అలాగే హేతుబద్దీకరణతో కొన్ని పోస్టులు రద్దయ్యాయని, అలాగే సచివాాలయాల్లో ఉద్యోగుల్ని దూర ప్రాంతాలకు బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతోందని, అదంతా నిజం కాదన్నారు. దీనిపై గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సచివాలయాల హేతుబద్ధీకరణ వల్ల ఈ వ్యవస్ధలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ఆసరాగా చేసుకుని విపక్షాలు సచివాలయ ఉద్యోగుల్ని తొలగిస్తారనే ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సచివాలయ వ్యవస్ధను కానీ, ఉద్యోగుల్ని కానీ తొలగించే ఉద్దేశం తమకు లేదని చెప్తున్నాయి. ఉన్న వ్యవస్ధనే సమర్ధవంతంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగానే మార్పులు తప్పడం లేదని వెల్లడిస్తున్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!
వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!
స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!
జగన్ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!
విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్..! పీఎన్బీఎస్పై తగ్గనున్న ఒత్తిడి!
ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?
ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!
టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!
ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!
ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!
టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!
ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!
నారా రోహిత్పై కిడ్నాప్ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్ చేస్తానన్న మంచు మనోజ్!
శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..
బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!
ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!
అమెరికా ప్రయాణికులకు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#Andhrapravasi #APSecretariat #APEmployeesRelief #BigAnnouncement #AndhraPradeshNews #GovernmentEmployees #EmployeeWelfare
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.